Tuesday, March 26, 2024

సీఎం పర్యటనకు చకచకా ఏర్పాట్లు – మంత్రి కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన కోసం ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. గురువారం నూతన కలెక్టరేట్‌ భవనాన్ని, బహిరంగ సభ జరిగే మైదానాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఈనెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని, తెరాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం లక్ష మందితో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు.

ముఖ్యమంత్రి సభ కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ, డీసీపీలు రూపేశ్‌, అఖిల్‌ మహజన్‌, అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, కుమార్‌ దీపక్‌, సీఐలు ప్రదీప్‌కుమార్‌, అనిల్‌కుమార్‌, గ్రంథాలయ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement