Thursday, April 25, 2024

Breaking: తిరుమ‌ల ఘాట్ రోడ్డులో కారు ద‌గ్ధం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కారు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. మూడవ కిలోమీటర్ వద్ద ఈ ఘటన జరిగింది. భక్తులు.. శ్రీవారి దర్శనానికి కర్నూలు నుండి మహేశ్వర రెడ్డి, సుజాతలతో పాటు మరికొందరు తిరుమలకు వెళ్తుండగా ఒక్కసారిగి కారులో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన భక్తులు వెంటనే కారు దిగి ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. అధికారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement