Thursday, May 16, 2024

వైసిపి తీర్థం పుచ్చకున్న బిజెపి నేతలు

శ్రీకాళహస్తి – పట్టణంలోని బిజెపి పార్టీ నాయకులు ఏర్పేడు మండలం నాయకులు రేణిగుంట కి సంబంధించిన బిజెపి నాయకులు పలువురు మంగళవారం మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి ఆయనకే సాధ్యమని ఆయన అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్నానని ఆయన వెంటే ఉండి అన్నీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని తిరుపతి ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ కోసం తమ ప్రాంతాల్లో ప్రచారం చేస్తామని సభా ముఖంగా తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర నియోజకవర్గ కోకన్వీనర్, భాజపా పార్టీ ఫ్లోర్ లీడర్ మరియు మాజీ కౌన్సిలర్ ఆర్కార్డ్ ముత్తు,ఏర్పేడు మండలం భాజపా పార్టీ అధ్యక్షుడు గాండ్ల శివకుమార్,ఏర్పేడు మండలం భాజపా పార్టీ జనరల్ సెక్రెటరీ రావెళ్ల హేమంత్ నాయుడు,శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించిన భాజపా రాష్ట్ర మహిళా మోక్ష ,మాజీ కౌన్సిలర్ గల్లా పుష్ప, మాజీ కౌన్సిలర్ రామచంద్రయ్య మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు సుమారు 300 మంది ఈరోజు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి , ఉపముఖ్య మంత్రి నారాయణ స్వామి ,పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినవారిలో గణేష్ ,మురళి యాదవ్ ,పాడి చంద్ర, సుబ్రహ్మణ్యం, హేమంత్, కార్తీక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement