Sunday, April 28, 2024

తిరుమ‌ల‌ ఘాట్ రోడ్డులో ప్రమాదం.. సీనియర్ జర్నలిస్ట్ మృతి

బ్రహ్మోత్సవాల కవరేజ్‌ పూర్తి చేసుకుని వెళ్తుండగా తిరుపతి మొదటి ఘాట్‌ రోడ్డులో వేగంగా దూసు కొచ్చిన వాహనం వచ్చి ఢీకొనడంతో తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు మబ్బు గోపాల్ రెడ్డి (77) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సందర్భంగా జర్నలిస్టు మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. టీటీడీ తరపున గోపాల్ రెడ్డి కుటుంబానికి తగిన సహకారం అందిస్తామని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని చైర్మన్ ప్రార్థించారు విలువలతో కూడిన ఓ మంచి జర్నలిస్టును కోల్పోయామని వారు పేర్కొన్నారు. జర్నలిస్టు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement