Monday, April 29, 2024

తిరుప‌తిలో షాకిచ్చే ఫ‌లితం – చింతా మోహ‌న్

శ్రీకాళహస్తి – తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల‌లో ఓట‌ర్లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా తీర్పు ఇవ్వ‌నున్నార‌ని కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధి చింతా మోహ‌న్ అన్నారు.. నేడు ఆయ‌న శ్రీకాళ‌హ‌స్తితో ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌జ‌ల నాడి కాంగ్రెస్ వైపు ఉంద‌ని, అన్ని వ‌ర్గాలు కాంగ్రెస్ రావాల‌ని కోరుకుంటున్నాయ‌ని అన్నారు.. బి జె పికి వైసిపి బి టీమ్ అని, అందుకు ఆ రెండు పార్టీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌న్నారు. ఇటు వైసిపి, అటు డిడిపిలు త‌మ ప్ర‌చార స‌భ‌ల‌కు డ‌బ్బులు, బిరియానీలు ఇచ్చి తీసుకొస్తున్నార‌ని ఆరోపించారు…చిత్తూరు జిల్లాకు చంద్ర‌బాబు నాయుడు చేసిందేమి లేద‌న్నారు.. దుగరాజపట్టణం ఓడరేవు, 7008 డబుల్ బెడ్ రూం ఇండ్లు ఆపిన ఘనత చంద్రబాబుదేన‌ని అన్నారు చింతా మోహ‌న్.. ఓటు వైసీపీకి వేసినా, టిడిపికి వేసినా బిజెపి పార్టీకి వేసినట్లే అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ సముద్రాల బత్తయ్యా నాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement