Wednesday, April 24, 2024

ఏపీలో కరోనా కేసుల వేగం.. తగ్గేదే లే

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,892 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,765 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 490, కృష్ణా జిల్లాలో 341, విశాఖ జిల్లాలో 335, నెల్లూరు జిల్లాలో 292, కడప జిల్లాలో 171, అనంతపురం జిల్లాలో 167, ప్రకాశం జిల్లాలో 161, శ్రీకాకుళం జిల్లాలో 100, కర్నూలు జిల్లాలో 79, తూ.గో. జిల్లాలో 78, విజయనగరం జిల్లాలో 49, ప.గో. జిల్లాలో ఆరుగురికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 1,245 మంది కరోనా నుంచి కోలుకోగా అనంతపురం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,18,597 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,94,896 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 16,422గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,279గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement