Saturday, May 18, 2024

ఘనంగా వాల్మీకి విగ్రహ ప్రతిష్ట..

మదనపల్లి – తంబల్లపల్లి నియోజకవర్గంలోని మొలకలచెర్వు మండలంలోని తలారి వారి పల్లి నందు ఘనంగా వాల్మీకి మహర్షి విగ్రహన్ని ప్రతిష్టించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాల్మికి సేవా దళ్ రాష్ట్ర యువత అధ్యక్షుడు తలారి మంజునాథ్ హాజరయ్యారు.. ఆయన కు తలరివారిపల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.. అనంతరం వాల్మికి మహర్షి విగ్రహాన్ని పూజర్లతో,తలారి మంజునాథ్ మరియు గ్రామస్తులు సమిక్షంలో ప్రతిష్టించారు..ఈ సందర్భంగా వాల్మికి సేవా దళ్ రాష్ట్ర యువత అధ్యక్షుడు తలారి మంజునాథ్ మాట్లాడుతూ దేశం మొత్తం పవిత్రంగా భావించే వాల్మికి మహర్షి రామణయాన్ని రచించిన మహా కవి వాల్మికి మహర్షి అని ఆయన కొనియాడారు..రానున్న రోజుల్లో కూడా వాల్మికి ల అభివృద్ధి కి తన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.. భవిష్యత్ లో ఆర్థికంగా, రాజకీయ0గా ఎదిగి పలువురికి ఆదర్శంగా నిలుస్తూ వాల్మికి ల అభివృద్ధి కి దోహద పడాలని ఆయన ఆకాంక్షించారు..
అనంతరం గ్రామస్తులు వాల్మికి సేవా దళ్ రాష్ట్ర యువత అధ్యక్షుడు తలారి మంజునాద్ పై ప్రశంసలు కురిపించారు.. వాల్మీకి ముద్దు బిడ్డగా అభివర్ణించారు..వాల్మికి మహర్షి ఆలయానికి తన మానవతా దృక్పథంతో పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించిన తలారి మంజునాథ్ ను గ్రామస్తులు మరియు మిత్రులు, అభినందించారు..ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున వాల్మికి సోదరులు వివిధ గ్రామాల నుండి హాజరయ్యారు..వాల్మికి సేవా దళ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాధవ రాజు,కడప జిల్లా అధ్యక్షుడు ముగి రెడ్డెప్ప,వాల్మికి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లంకి శ్రీనివాసులు, వాల్మికి సేవా దళ్ అనంతపురం జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు విజయమ్మ, కృష్ణ జిల్లా యువత అధ్యక్షుడు శివతేజ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.. వాల్మికి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో చెక్క భజనలు ,కోలాటాలు పలువురిని ఆకట్టుకున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement