Wednesday, April 17, 2024

ఖమ్మం జిల్లాకు మరో ఐటీ హబ్

ఖమ్మం జిల్లాలో రెండో ఐటీ టవర్‌ నిర్మాణానికి అడుగులు ముందుకు పడ్డాయి. ఇప్పటికే ఖమ్మంలోని ఇల్లందు సర్కిల్ వద్ద ప్రస్తుతం ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించగా.. సేవలు నిర్విరామంగా సాగుతున్నాయి. ఇప్పుడు మరో ఐటీ టవర్ కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. 36 కోట్ల రూపాయల వ్యయంతో 55 వేల చదరపు అడుగుల్లో టవర్‌ను నిర్మించనున్నారు. 570 మంది ఒకేసారి పని చేసుకునేలా సువిశాలమైన భవన నిర్మాణం చేపట్టనున్నారు. టవర్‌ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో జిల్లాలోని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టవర్‌ నిర్మాణమై అందుబాటులోకి వస్తే జిల్లా నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ఆయా టవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement