నెల్లూరు, ప్రభన్యూస్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్హన్ రెడ్డి ఈనెల 28వ తేదీన నెల్లూరుకు రానున్నారు. అదే రోజు నెల్లూరు శివారు కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభకు హాజరుకానున్నారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు 28వ తేదీ ఉదయం 11 గంటలకు అమరావతి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో నెల్లూరులోని కనుపర్తిపాడుకు చేరుకుంటారు.
అక్కడి నుండి రోడ్డు మార్గంలో వీపీఆర్ కన్వెన్షన్ హాల్కు చేరుకుంటారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం తర్వాత హెలికాప్టర్లో తిరిగి అమరావతికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు హెలీపాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై పరిశీలన చేశారు. రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి పర్యటన వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..