Monday, May 13, 2024

అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. అనంత‌పురం జిల్లాలో ఘ‌ట‌న‌

కళ్యాణదుర్గం (అనంతపురం) ప్రభ న్యూస్‌ : కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం మాలేపల్లి గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో చిరుత పులి మృతి చెందింది. కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుతపులులు సంచరిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా జరిగిన ఘటన మరింత భయాందోళనకు గురిచేసింది. చిరుతపులి శరీరంపై గాయాలు ఉండడంతో కొండపై భాగం నుంచి కిందకు జారిపడిందా, లేక ఏదైనా వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement