Sunday, April 28, 2024

కుప్పంలో చంద్రబాబు గెలవలేరు.. మంత్రి రోజా

ఈసారి కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె మాట్లాడుతూ… జగనన్న మొదటిసారి కుప్పంలో అడుగు పెడితే అదిరిపోయిందన్నారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై ప్రజలను కన్ఫ్యూజన్ కు గురిచేసే యత్నాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించినప్పుడు గెంటేసి ఉంటే ఇవాళ ఎన్టీఆర్ ప్రధాని అయ్యే స్థాయిలో ఉండేవారన్నారు. బతికుండగానే ఎన్టీఆర్ ను చంపేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు కుటుంబ సభ్యులకు లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement