Saturday, April 27, 2024

AP : ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్‌షాతో భేటి

మాజీసీఎం చంద్ర‌బాబు ఇవాళ ఢిల్లీ వెళ్ల‌నున్నారు. పొత్తులపై చర్చించడానికి ఢిల్లీకి రమ్మని చంద్రబాబుకు అమిత్‌ షా ఆహ్వానం మేర‌కు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధ‌మయ్యారు. సాయంత్రం హైద‌రాబాద్ నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేర‌నున్నారు. ఇవాళ రాత్రి అమిత్‌షా, జేపీ న‌డ్డాల‌తో బాబు భేటి కానున్నారు.

- Advertisement -

చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని హైకమాండ్‌కు ఇప్పటికే మెజారిటీ ఏపీ బీజేపీ నేతలు సూచించారు. ఏపీలో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు, మూడు ఎంపీ సీట్లు గెలువాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement