Friday, May 10, 2024

TS : నేడు ఢిల్లీకి సీఏం రేవంత్ రెడ్డి

ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. గురువారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క కూడా వెళ్లనున్నారు. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఇసీ సభ్యుడి హోదాలో సమావేశంలో పాల్గొననున్నారు.

- Advertisement -

కాగా, కాంగ్రెస్ అభ్యర్థుల తోలి జాబితాను ఏఐసీసీ విడుదల చేయనుంది. 150 నుంచి 200 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల కానుంది. తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థులను తోలి జాబితాలో ప్రకటించనుంది. తెలంగాణ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి అప్పజెప్పింది. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తం నేతలు స్పష్టం చేశారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement