Friday, May 3, 2024

Chandrababu: ఇవాళ ఎన్టీఆర్‌, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

నేడు ఎన్టీఆర్, పశ్చిమగోదావరి జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం తిరువూరులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.

సాయంత్రం అచంటలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చేరుకొని అక్క‌డ అయ్యప్పస్వామి ఆలయం వద్ద బహిరంగ సభకు హాజరవుతారు. స‌భ‌ను ముగించుకొని మ‌ధ్యాహ్నాం తిరువూరు నుంచి హెలికాప్ట‌ర్‌లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంటకు వెళ్తారు. అక్క‌డ పార్టీ చేరిక ప‌ర్వం ముగించుకొని ఆచంట‌-మార్టేరు రోడ్ నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement