Saturday, April 27, 2024

AP : చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు రెండురోజుల ప‌ర్య‌ట‌న‌…

టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు రెండు రోజులు ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనెల 25, 26 తేదీల్లో కుప్ప నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు. 25న‌ ఉదయం పీఈఎస్ వైద్య కళాశాలకు చేరుకుంటారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు.

- Advertisement -

మధ్యాహ్నం బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం మైనార్టీ నేతలతో సమావేశం అవుతారు. రాత్రికి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. 26న‌ఉదయం ప్రజల నుంచి వినతలు స్వీకరిస్తారు. పార్టీ కార్యాలయంలో తెలుగు యువతకు వన్ బూత్, టెన్ యూత్ కార్యక్రమంపై దిశానిర్దేశం చేస్తారు. అక్కడి నుంచి రామకుప్పం మండలంలోని రాజుపేట వద్ద హంద్రీ-నివా కాలువ పనులను చంద్రబాబు పరిశీలిస్తారు. అనంతరం హెలికాఫ్టర్ ద్వారా తిరుగు పయనమవుతారు

Advertisement

తాజా వార్తలు

Advertisement