Tuesday, May 7, 2024

భోగి వేడుక‌ల్లో పాల్గొన్న‌ చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఫ్యామిలీతో సంక్రాంతి పండుగ‌కు త‌న స్వ‌గ్రామ‌మైన‌ చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు వెళ్లారు. అక్క‌డ నిర్వ‌హించిన భోగి వేడుక‌ల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఈ వేడుకల్లో నారా లోకేశ్‌తో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు నారావారిపల్లెకు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ఇక తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. పనికిరాని వస్తువులన్ననీ భోగి మంటలలో వేశామని అన్నారు. జీవో నెంబర్ 1 కాపీలను భోగి మంటల్లో వేసి చంద్రబాబు నిరసన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement