Tuesday, May 7, 2024

Breaking: చంద్రబాబు మోములో చిరునవ్వు.. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపు లాయర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అయితే ఈనెల 30వతేదీన ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.

ఆగస్టు నెల 9వతేదీన చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపైన వాదనలు పూర్తయిన తరువాత కోర్టు తీర్పునిస్తూ వెల్లడించింది. దీంతో, 52 రోజుల రిమాండ్ తరువాత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించింది. గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు కాగా… ప్రస్తుతం హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ రావడంతో చంద్రబాబు మోములో చిరునవ్వు.. టీడీపీ పార్టీ కేడర్ లో ఆనందం వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement