Friday, May 24, 2024

Chandrababu – అంగళ్లు కేసు బెయిల్ పై వాద‌న‌లు పూర్తి – తీర్పు రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు

అమ‌రావ‌తి – ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో చోటు చేసుకున్న అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 22వ తేదీన ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆ త‌ర్వాత విచారణను నేటికి వాయిదా వేసింది. ఈరోజు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పై వాదనలు జరిగాయి. కాసేపటి క్రితం హైకోర్టులో ఇరువైపు వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement