Thursday, April 25, 2024

AP : నేటి నుంచి ప్రజాగ‌ళం… కుప్పం నుంచే ప్ర‌చారం ప్రారంభించ‌నున్న బాబు…

టీడీపీ అధినేత‌ చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఇవాళ్టి నుంచి సభలు, సమావేశాలు రోడ్‌షోలు చేయనున్నారు. నేటి నుంచి చంద్రబాబు ప్రజాగళం ప్రచార యాత్ర కూడా రాయలసీమ నుంచే ప్రారంభం అవుతుంది. కుప్పం నియోజకవర్గం నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనను మొదలుపెట్టి ఈనెల 31వ తేదీ వరకు ప్రచార పర్యటన షెడ్యూల్ ప్రకారం నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. ప్రతిరోజు రోజుకు రెండు నుండి మూడు నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటన సాగేలా టీడీపీ ఏర్పాట్లు చేసింది.

ఉద‌యం కుప్పం నుండి బయలుదేరి పలమనేరులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరులో జరిగే ప్రజా గళం కార్యక్రమంలో పాల్గొంటారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు చంద్రబాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement