Sunday, April 28, 2024

CBI – కడుపుమంటతోనే అవినాష్ పై దుష్ప్ర‌చారం.. స‌జ్జ‌ల

అమరావతి: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారంనాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ,. తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే నాటకాలు అంటూ ప్రచారం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి సహకరిస్తున్నారన్నారు. అవినాష్ రెడ్డి అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. వినాష్ రెడ్డి ఇప్పటికే ఆరు దఫాలు సీబీఐ విచారణకు హాజరయ్యార‌నే విష‌యాన్ని గుర్తు చేస్తూ, అవినాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సిబిఐ ని రాష్ట్రంలోకి రాకుండా లేఖ ఇచ్చిన చంద్ర‌బాబు పై అప్ప‌టి మీడియా మోనంగా ఎందుకు ఉంద‌ని నిల‌దీశారు.. వాస్త‌వానికి సీఎం జగన్ పాలనను చూసి విపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని స‌జ్జ‌ల అన్నారు. నాలుగేళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చినట్టుగా ఆయన చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏపీ పాలనను మెచ్చుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement