Thursday, May 2, 2024

వివేకా హత్య కేసులో విచారణ ముమ్మరం

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మూడో రోజుకు చేరుకుంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ కొనసాగుతోంది. పులివెందులకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ తుల్లాను రెండవ రోజు సీబీఐ బృందం విచారిస్తోంది. పులివెందులకు చెందిన కిరణ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని కూడా విచారిస్తోంది. అలాగే పులివెందులకు చెందిన మరికొంతమందిని సైతం సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. సొంత ఇంటి బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నారు. ఆ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనిపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. అయితే, సిట్ ఆ దర్యాప్తులో ఏమీ తేల్చలేకపోయింది. ఆ తరువాత వచ్చిన జగన్ సర్కార్ కూడా సిట్ వేయగా.. అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. ఈ కేసు ఎంతకీ తేల్చకపోవడంతో వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత హైకోర్టు ఆశ్రయించారు. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ మరో దుబ్బాక కానుందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement