Wednesday, May 1, 2024

వివేకానంద హత్య కేసులో మొదలైన సీబీఐ విచారణ

పులివెందుల, ప్రభన్యూస్‌ : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వివేకా హత్య కేసులో సునీల్‌ యాదవ్‌ సోదరుడు కిరణ్‌ కుమార్‌ యాదవ్‌ను విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందజేశారు. అనంతరం ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌లో విచారణ చేపట్టారు. సునీల్‌ యాదవ్‌ తన లాయర్‌తో కలిసి విచారణకు హాజరౌతానని సీబీఐ అధికారులకు తెలిపినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement