Monday, May 20, 2024

KNL: కారు బోల్తా.. ఇద్దరు మృతి..

ఆలూరు, ప్రభ న్యూస్ : కారు బోల్తా పడి ఇద్దరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చింతకుంట గ్రామ సమీపన ఈ సంఘటన జరిగింది. నియోజకవర్గ పరిధిలోని హలహర్వి మండలం చింతకుంట గ్రామ సమీపన గత రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని సిడిగిన మల నుండి మంత్రాలయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం బళ్ళారి ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement