Tuesday, April 30, 2024

AP: 175 సీట్లు గెలిచేందుకే అభ్య‌ర్ధుల మార్పులు… వైవి సుబ్బారెడ్డి…

విశాఖ‌ప‌ట్నం: వైనాట్‌ 175 అంటూ వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతోన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అభ్యర్థుల్లో మార్పులు, చేస్తోంది.. దీంతో.. కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి మొదలైంది.. మరికొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అయితే, 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నాం.. అందుకే మార్పులు చేర్పులు జరుగుతున్నాయని తెలిపారు వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి.

విశాఖ నార్త్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ . 175 నియోజకవరర్గాల్లో గెలుపు లక్ష్యంగా మార్పులు చేస్తున్నాం అన్నారు.. ఉత్తరాంధ్రలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీకి అవకాశం కల్పించామ‌ని స్ప‌ష్టం చేశారు.. కుటుంబ పరంగా తాము సీట్లు ఇవ్వడం లేద‌ని. ప్రజల్లో బలం, అర్హత ఉన్న వాళ్లకే అవకాశం కల్పిస్తున్నాం అని అన్నారు.

టిడిపి అధినేత చంద్రబాబు అన్ని వర్గాలను రెచ్చగొట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి.. ఎపి ని స‌ర్వ‌నాశనం చేసిన చంద్ర‌బాబుని, ఎపిలో చిరునామాలేని ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఇక్క‌డి ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌ర‌ని పేర్కొన్నారు.
మరోవైపు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం జనసేనలో చేరుతున్న విషయం నాకు తెలియద‌ని అంటూ దీనిపై అవగాహన లేదని దాటవేశారు. ఇక, ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన విశాఖను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింద‌ని విమ‌ర్శించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చొరవతో క్లీన్ సిటీగా.. విశాఖపట్నం.. జాతీయ స్థాయిలో నాలుగో స్థానానికి చేరుకుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement