Thursday, May 9, 2024

TS: అబ‌ద్దాల పునాదుల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయాలని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భారాస ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ మండిప‌డ్డారు.

కేసీఆర్ హ‌యాంలో ల‌క్షా 60 వేల 63 ఉద్యోగాలు భ‌ర్తీ చేసిన‌ట్లు తెలిపారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ఏయే శాఖ‌ల్లో ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేశారో ఇప్ప‌టికే ప‌లుమార్లు చెప్పామ‌ని గుర్తు చేశారు. 42 వేల ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌గా, వివిధ ద‌శ‌ల్లో భ‌ర్తీ ప్ర‌క్రియ ఉంద‌న్నారు. ఆ ఉద్యోగాల భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఐటీతో పాటు ఇత‌ర రంగాల్లో ల‌క్ష‌లాది ఉద్యోగాలు క‌ల్పించామ‌న్నారు. ఇప్ప‌టికైనా కాంగ్రెస్ నేత‌లు వాస్త‌వాలను గ్ర‌హించాల‌ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోరారు.. ఇప్ప‌టికైన కాంగ్రెస్ నేత‌లు అబ‌ద్దాలు చెప్ప‌డం మాని,,, ఇచ్చిన హామీల‌ను ఇచ్చిన మాట ప్ర‌కారం వంద రోజుల‌లో నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement