Thursday, May 2, 2024

Tirumala : ఈనెల 19న శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు

టీటీడీ ఈనెల 19న బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని ఈ నెల 19న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.

ఉత్సవాల్లో భాగంగా ఆ రోజు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కాగా, గడిచిన 24 గంట్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఇక ఈ తరుణంలోనే.. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 71, 037 మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 25635 మంది భక్తులు….తలనీలాలు సమర్పించారు. గడిచిన 24 గంట్లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్లుగా నమోదు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement