Saturday, May 4, 2024

హెలికాప్టర్ ద్వారా.. రాళ్ళ గంగమ్మ రధోత్సవం పై పూల వర్షం

గుడుపల్లి, (ప్రభ న్యూస్ ): గుడుపల్లి మండల కేంద్రంలో వెలసియున్న శ్రీ ప్రసన్న రాళ్ళ గంగమ్మ జాతర మహోత్సవంలో అమ్మవారి కళ్యాణోత్సవం జరిపి గురువారం నాడు అత్యంత వైభవంగా రధోత్సవం ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి రధోత్సవం ఊరేగింపు జరిపే సమయంలో హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ ఘట్టం జరగడంతో భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ భక్తితో మునిగిపోయారు. కర్ణాటక రాష్ట్రం కు చెందిన భక్తుడు సహాయంతో హెలికాప్టర్ ద్వారా అమ్మవారికి పూల వర్షం కురిపించడం అనాయితీగా వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement