Tuesday, May 14, 2024

మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్‌ను త్వరగా నిర్మించండి: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా నరసరావుపేటలోని డిస్ట్రిక్‌ స్పోర్ట్స్‌ అథారిటీ సబ్‌ సెంటర్‌లో మల్టీ పర్పస్‌ ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ఖేలో ఇండియా స్కీమ్‌ కింద త్వరితగతిన నిర్మించాలని కేంద్ర యువజన క్రీడా వ్యవహరాల మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభ్యర్థించారు. బుధవారం ఢిల్లీలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.

దీని నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.8కోట్లకు సంబంధించిన వివరాలను రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక,సాంస్కృతిక శాఖలోని క్రీడలు, యువజన సేవల విభాగం కేంద్రానికి పంపినట్లు వివరించారు. ఖేలో ఇండియా స్కీం కింద త్వరితగతిన నిర్మాణ అంచనా వ్యయం రూ.8కోట్లను మంజూరు చేసి, ఈ కాంప్లెక్‌ను నిర్మించాలని విన్నవించారు. నరసరావుపేట, చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి క్రీడల్లో రాణించే యువతకు, విద్యార్థులకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయల విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement