Wednesday, May 15, 2024

AP : అర్ధరాత్రి కడప సెంట్రల్‌కు బీటెక్ ర‌వి…14రోజుల రిమాండ్

పది నెలల క్రితం కడప విమానాశ్రయం వద్ద పోలీసులతో వాగ్వాదం, ఆందోళన చేపట్టిన కేసులో అరెస్టు అయ్యి టీడీపీ నేత మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి‌కి (బీటెక్‌ రవి) కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మంగళవారం అర్ధరాత్రి ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

వ్యక్తిగత పనిమీద మంగళవారం సాయంత్రం పులివెందుల నుంచి కడప వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించిన అనంతరం కడపలో జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీంతో బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement