Monday, April 29, 2024

AP : వి.కోట..ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం…. చిరుత పులి మృతి

వి.కోట..రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిరుతపులిని అత్యుత్సాహంతో ఫారెస్ట్ బీట్ అధికారులు అర్ధరాత్రీ పలమనేరు కు తరలించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు తిరిగి పలమనేరునుంచి చిరుత పులి మృతదేహాన్ని ఘటనా స్థలానికి తీసుకురావాలి అన్నట్లు సమాచారం.

పలమనేర్ రేంజర్ శివన్న నేతృతంలో మృతి చెందిన చిరుతపులికి ఘటన స్థలంలోని పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు.గత మూడు నెలలుగా చిరుత పులి కడుపుతో ఉన్నట్లు సమాచారం అనారోగ్య కారణంగా రోడ్డు ప్రాంతంలో ఉన్నట్లు ఆవుల కాపరులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement