Friday, May 3, 2024

AP: కనకదుర్గమ్మ సేవలో బ్రో చిత్ర బృందం

ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న కనకదుర్గమ్మ వారి సేవలో బ్రో చిత్ర బృందం పాల్గొన్నారు. బ్రో చిత్రం విజయోత్సవంలో భాగంగా విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకున్న చిత్ర బృందం అమ్మ వారి సేవలో పాల్గొన్నారు. హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఘని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురు ప్రసాద్, ఆలయ మర్యాదలతో చిత్ర బృందానికి ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ డిప్యూటీ గురు ప్రసాద్ అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement