Saturday, May 4, 2024

Breaking : ఆయిల్ ట్యాంక్ లో ఊపిరాడ‌క.. ఏడుగురు కార్మికులు మృతి

కాకినాడ జి.రాగంపేట‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆయిల్ ట్యాంక్ లో ఊపిరాడ‌క కార్మికులు మృతి చెందారు. అంబ‌టి ఆయిల్ కంపెనీ కి చెందిన ఏడుగురు కార్మికులు మృతి చెందారు. కాగా చ‌నిపోయిన వారిలో ఐదుగురు పాడేరు వాసులు ఉన్నారు.మ‌రో ఇద్ద‌రు పెద్దాపురం మండ‌లం పులిమేరు వాసులుగా గుర్తించారు. కాగా ఆయిల్ ట్యాంక్ ని శుభ్రం చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పరిశ్రమలోని ఆయిల్ ట్యాంకర్‌ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చూస్తుంటారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ట్యాంకర్‌‌లో ఆయిల్ మొత్తం తీసివేశారు. దీంతో ఏడుగురు కార్మికులు అందులో దిగి ట్యాంకర్‌ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడటంతో కార్మికులు ఊపిరి అందలేదు. వెంటనే బయటకు వచ్చేందుకు కార్మికులు ప్రయత్నించినప్పటికీ ఫలించకపోవడంతో ఊపిరాడక ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement