Monday, April 29, 2024

Big Story: ఆడపడుచులకు ఇంకో పథకం.. కేంద్రం మరో ఆలోచన.. అదేంటో తెలుసా!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్న సంకల్పం.. కేంద్రం మదిలో మరో కొత్త ఆలోచన వచ్చింది. దాన్ని అమలు చేయడానికి ప్రణాళికరులు రూపొందిస్తున్నారు. అదేంటంటే లక్షపతి పథకం.. గ్రామీణ ప్రాంత మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు ఆర్థిక స్వావలంబన సాధించేలా లక్ష్యంతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ లక్షపతి ఎస్‌హెచ్‌జీ మహిళా కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

గ్రామీణ ఎస్‌హెచ్‌జీ మహిళల ఆర్షిక ఆదాయం కనీసం లక్ష రూపాయలుగా ఉండేలా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. లక్ష్యాన్ని సాధించడానికి దేశంలో 250 లక్షల మంది గ్రామీణ ఎస్‌హెచ్‌జీ మహిళలకు రానున్న రెండేళ్లలో జీవనోపాధి పొందడానికి సహకారం అందించాలని గ్రామీణాభి వృద్ధి మంత్రిత్వశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి దేశంలో అమలులో ఉన్న వివిధ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు మంత్రిత్వశాఖ నూతన మార్గ దర్శకాలను జారీ చేసింది.

దీని కోసం రాష్ట్రాలు, బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌, ట్రాన్‌ఫోమేషన్‌ రూరల్‌ ఇండియా ఫౌండేషన్‌ ప్రతినిధులతో మంత్రిత్వశాఖ ఇటీవల సమావేశాన్ని నిర్వహించింది. మహిళలకు మరిన్ని జీవనోపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చే అంశాలపై సమావేశంలో చర్చించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమ, అటవీ ఉత్పత్తుల సేకరణ లాంటి అంశాల ద్వారా విభిన్న అవకాశాలను అందించి వార్షిక ఆదాయం రూ.లక్ష ఉండేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు.

లక్ష్య సాధనకు స్వయం సహాయక బృందాలు, గ్రామీణ సంస్థలు, క్లస్టర్‌ స్థాయి సమాఖ్యలను మరింత బలోపేతం చేయవలసి ఉందని అభిప్రాయపడిన సమావేశం ఈ దిశలో చర్యలను అమలు చేయాలని తీర్మానించింది. వివిధ రంగాల్లో శిక్షణ పొం దిన సభ్యులు స్వయం సహాయక బృందాలు లక్ష్యాల మేరకు పని చేసేలా చూడాలని సమావేశం పేర్కొంది. లక్ష్య సాధనలో పౌర సంఘాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర ప్రైవేట్‌ సంస్థల సహకారాన్ని తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్రాలు ఈ దిశలో ప్రణాళికలను రూపొందించాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూచించింది.

సంతృప్తి విధానంలో ప్రస్తుతం జాతీయ జీవనోపాధి మిషన్‌ అమలు జరు గుతోంది. ఈ కార్యక్రమం ద్వారా 6768 బ్లాకుల్లో 70 లక్షల స్వయం సహాయ బృం దాల ద్వారా 7.7 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. ప్రారంభ పెట్టుబడిని అందించడంతో పాటు ఈ బృందాలకు ప్రతి ఏడాది రూ. 80 వేల కోట్ల మేరకు నిధులను సమకూర్చడం జరుగుతోంది. ఈ పథకం కింద వివిధ వర్గాలు, కులాలకు చెందిన మహిళలు ఒక స్వయం సహాయక బృందంగా ఏర్పడతారు. ఈ బృందాలతో కూడిన సమాఖ్య బృందం సభ్యులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించడానికి వారి ఆదాయం, జీవన ప్రమాణాలు అభివృద్ధి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement