Thursday, May 2, 2024

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

ఏపీ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు భీమ్లా నాయక్ చిత్ర నిర్మాణ సంస్థ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. మంత్రి మృతికి గౌరవ సూచకంగా భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రకటించింది. వాస్తవానికి భీమ్లా నాయక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా.. వాయిదా వేశారు.

‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించాలని నిర్ణయించి, ముఖ్య అతిధిగా కేటీఆర్‌ని కూడా ఆహ్వానించారు. యూస‌ఫ్ గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించేందుకు ప్లాన్ చేశారు. అయితే, విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనసు మనస్కరించట్లేదు చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్.. సినిమా వేడుకను ఆపుతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదలకు సిద్ధమ‌వుతోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో రానా దగ్గుబాటి మరో హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని సాగర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ స‌ర్టిఫికేట్ దక్కించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement