Monday, May 6, 2024

గౌతమ్ రెడ్డి స్నేహంగా మెలిగేవారు: బాలకృష్ణ

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంపై పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలుపుతున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక లేరన్న మాట వినడానికే బాధగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా గౌతమ్ రెడ్డి స్నేహంగా మెలిగేవారని అన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement