Monday, April 29, 2024

ఉమెన్స్ బాక్సింగ్ లీగ్ సోంపేట యువతికి పతకం

చిత్తూరు జిల్లాలో చిత్తూరు బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెన్స్ అండ్ ఉమెన్స్ బాక్సింగ్ లీగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన లండ కిరణ్ కుమారి బంగారు పతకం కైవసం చేసుకుంది. తిరుపతిలో శ్రీ పద్మావతి యూనివర్సిటీలో బి.పి.డి చదువుతూ బాక్సింగ్ క్రీడారంగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఈ విజయం పట్ల తన తండ్రి అయిన లండ సూర్యనారాయణ, బాక్సింగ్ కోచ్ సురేంద్ర తో పాటుగా కుటుంబ సభ్యులు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement