Sunday, April 28, 2024

AP: ప్రేమ పేరుతో నమ్మించి… చంపాల‌ని స్లో పాయిజ‌న్​.. చికిత్స పొందుతూ యువతి మృతి

ప్రేమ పేరుతో ఆమె చుట్టూ తిరిగాడు… ఆమెను న‌మ్మించి వంచించాడు… తీరా పెళ్లి చేసుకోవాల‌ని ప్రియురాలు ఒత్తిడి తేవ‌డంతో చంపాల‌ని ప‌థ‌కం ప‌న్నాడు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మాయ‌మాట‌లు చెప్పి ఆమెకు స్టో పాయిజ‌న్ ఇచ్చాడు… ప్రాణాల‌తో పోరాడుతూ ఆమె మృతి చెందింది. ఈఘ‌ట‌న విశాఖ‌లో చోటుచేసుకుంది.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువతిపై విష ప్రయోగం చేయగా.. ఆమె చనిపోయింది. నఅనకాపల్లి జిల్లా నర్సీపట్నం కి చెందిన మాధురి, శేఖర్‌లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.. గత ఆరేళ్ల నుంచి వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె అడ్డం తొలగించుకోవాలని ప్రయత్నించాడు. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం నిర్వహిస్తున్నారు. జనవరి 27న వీరిద్దరూ విశాఖపట్నంలోని ఓ లాడ్జిలో ఉన్నారు. అదేరోజు అర్ధరాత్రి దాటిన తరవాత యువతిని శారదానగర్‌లోని ఇంటికి దిగబెట్టి వెళ్లిపోయాడు.

- Advertisement -

ఆ తర్వాత ఆమె తలనొప్పిగా ఉందని గదిలోకి వెళ్లి పడుకుంది. మరుసటి రోజు నీరసపడి వాంతులు చేసుకోవడంతో 30న నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె విశాఖపట్నం ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉందని.. నెమ్మదిగా పనిచేసేలా విషప్రయోగం చేసి చంపాలని శేఖర్‌ ప్రయత్నించినట్లు ఆమె రెండు రోజుల క్రితం ఆరోపించారు.

అయితే పరిస్థితి విషమించి యువతి ఇవాళ (సోమవారం) ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. తమ బిడ్డ చనిపోవడానికి చంద్రశేఖర్ కారణమని.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి డిమాండ్ చేస్తోంది. తన కుమార్తె పెళ్లి చేసుకోవాలని కోరడంతో వదిలించుకునేందుకు అతడు విష ప్రయోగం చేశాడని వారు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement