Sunday, April 28, 2024

CBN: అయోధ్య‌లో చంద్ర‌బాబు… రాముని ప్రాణ‌ప్ర‌తిష్ట‌ చూసే భాగ్యం క‌లిగింది

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

అయోధ్య చేరుకున్న చంద్రబాబు వెంట ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు. రామ మందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో అదృష్టం ఉంటే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడగలిగే భాగ్యం దక్కినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement