Sunday, April 28, 2024

ఆత్మ‌కూరు బై ఎల‌క్ష‌న్‌, బీ ఫామ్ అందించిన సీఎం జ‌గ‌న్‌.. రేపే మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి నామినేష‌న్‌

శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఉపఎన్నిక‌లో బుధ‌వారం మ‌రో కీల‌క ఘ‌ట్టం పూర్త‌య్యింది. ఉప ఎన్నికలో వైసీపీ అభ్య‌ర్థిగా ఇప్ప‌టికే ఖ‌రారైన మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డికి ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బీ ఫామ్ అంద‌జేశారు. దీంతో రేపు అన‌గా జూన్ 2వ తేదీన విక్ర‌మ్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. కాగా, ఇవ్వాల (బుధ‌వారం) తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో జ‌గ‌న్‌ను విక్ర‌మ్ రెడ్డి త‌న తండ్రి మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డితో క‌లిసి భేటీ అయ్యారు.

ఈ భేటీలో విక్ర‌మ్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి పాల్గొన్నారు. జ‌గ‌న్ కేబినెట్‌లో ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ప‌నిచేస్తూ ఈ మ‌ధ్య‌నే గుండెపోటుతో చ‌నిపోయిన‌ మేక‌పాటి గౌతం రెడ్డి మృతితో ఆత్మ‌కూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ స్థానానికి పార్టీ అభ్య‌ర్థిగా గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు విక్ర‌మ్ రెడ్డికి అవ‌కాశం క‌ల్పించాల‌ని మేక‌పాటి ఫ్యామిలీ జ‌గ‌న్‌ను కోరింది. ఆ మేర‌కే విక్ర‌మ్ రెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని జ‌గ‌న్ ఖ‌రారు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement