Wednesday, May 1, 2024

మార్చి 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

మార్చి 7వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా సమావేశాలు నిర్వహించే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో తొలిరోజైన మార్చి 7న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలియజేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. మార్చి 8న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తారు. మార్చి 11 లేదా 14న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement