Saturday, May 18, 2024

తిరుపతిలో నిర్మాతల మండలి భవనంపై త్వరలో నిర్ణయం

నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌
తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి: తిరుపతిలో ఉన్న నిర్మాతల మండలి భవనాన్ని ఏమి చేయాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని
నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ తెలిపారు. ఆయన నిర్మాతల మండలి సభ్యుడు మోహన్‌, నిర్మాత రామ్‌సత్యనారాయణతో కలిసి ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జరిగిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమావేశం విజయవం తమైందని తెలి పారు. భవిష్య త్తులోనూ సమా వేశాలు నిర్వహించి, చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం యత్నిస్తామని తెలిపారు. తిరుపతిలో నిర్మాతల మండలి భవనం వృథాగా ఉందని, రాబోవు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మూవీటవర్స్‌ నిర్మాణానికి స్థల సేకరణలో ఉన్నామని, టవర్స్‌లో ప్లాట్ల కోసం సభ్యుల నమోదు ప్రక్రియ ప్రారంభించామని సభ్యుడు మోహన్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement