Monday, May 6, 2024

Big Breaking | చర్చి విషయంలో గొడవ.. గొడ్డళ్లు, కర్రలతో పరస్పరం దాడులు

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం, వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీల మధ్య కొట్లాట జరిగింది. పెద్దారవీడు మండలంలో ఇవ్వాల (ఆదివారం) రాత్రి వివాదం తలెత్తింది. చర్చి విషయంలో జరిగిన చిన్న లొల్లి కాస్త ఘర్షణలకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

తోకపల్లిలోని ఎస్సీపాలెంలో చర్చి విషయంలో జరిగిన గొడవ కాస్త పరస్పరం దాడులు చేసుకుని కొట్టుకునే దాకా వచ్చింది. తెలుగుదేశం, వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలకు చెందిన ఇరు వర్గల వారు గొడ్డళ్లు, కర్రలతో అటాక్​ చేసుకుని తలలు పగలగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 15 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. కొట్లాటలో గాయపడ్డ వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement