Sunday, April 28, 2024

AP – వైసిపి ఎంపి రఘురామకృష్ణరాజు పార్టీకి రాజీనామా

వైసీపీ పార్టీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ పార్టీకి ఇవాళ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

 గజనీలాంటి మనస్తత్వం కలిగిన మీతో కలసి తాను పని చేయలేనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై ఎంపీగా అనర్హత వేటు వేయించేందుకు మొహమ్మద్ గజినీ మాదిరి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారని… మీరు కోరుకున్న ఫలితం ఈరోజు వచ్చిందని రాజీనామా లేఖలో రఘురాజు పేర్కొన్నారు. తనపై మీరు దాడి చేసిన ప్రతి సారి, తనను భౌతికంగా నిర్మూలించాలని మీరు ప్రయత్నించినప్పటికీ… తాను కూడా అంతే స్థాయిలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేశానని చెప్పారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement