Sunday, April 28, 2024

AP – నీళ్లు ఇవ్వ‌కుండా ప్రాజెక్ట్ కు ప్రారంభోత్స‌వమా – జ‌గ‌న్ పై టిడిపి నేత‌లు ఫైర్

పశ్చిమ ప్రకాశం – ప్ర‌భాన్యూస్ ప్రతినిధి – అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు, కాలువలు పూర్తయిందంటూ జాతికి అంకితం చేస్తూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నార‌ని విమర్శించారు టిడిపి నేత‌లు… వెలిగొడ ప్రాజెక్ట్ లో నీటి బిందెలతో నీటిని పోస్తూ నేడు నిరసన తెలిపారు.. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వైపాలెం టిడిపి ఇన్చార్జి జి.ఎరిక్షన్ బాబుల ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు భారీ సంఖ్యతో కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించారు. అనంత‌రం మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఏరిక్షన్ బాబులు మాట్లాడుతూ 10వేల మంది నిర్వాసితులను రోడ్డున పడేసి వారి దిబ్బపై జ‌గ‌న్ పైలాన్ ఆవిష్కరించార‌ని మండిప‌డ్డారు.. పశ్చిమ ప్రాంత ప్రజలు, రైతుల ఓట్లు దండుకోవడం కోసమే జగన్నాటకం ఆడుతున్నారని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే నీళ్లు ఇవ్వకుండా ఎలా పూర్తయింది అంటార‌ని నిల‌దీశారు.

వైసిపి నాయకులు అందరూ కలిసి బిందెలతో నీళ్లు తెచ్చి ప్రాజెక్టులో నీరు నింపుతారా అంటూ ప్రశ్నించారు… ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీతోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. వైసిపి మాయమాటలు నమ్మి పరిస్థితిలో ప్రజలు లేరని, వచ్చే ఎన్నికలలో వైసిపి ఎమ్మెల్యేలను చిత్తుచిత్తుగా ఓడించి జగన్ నాటకానికి తెర దింపుతారని హెచ్చ‌రించారు..ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం మార్కాపురం నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement