Monday, April 29, 2024

అసెంబ్లీ ఆవరణలో వ్యాక్సినేషన్..

ఏపీ శాసన మండలి ఆవరణలో రాష్ట్ర శాసన పరిషత్ సభ్యులకు సభ్యులకు మరియు శాసన మండలి సచివాలయ సిబ్బంది కి వ్యాక్సినేషన్ ఈ ప్రక్రియను ప్రారంభించాలని తమ్మినేని సీతారాం ఆదేశించారు. ఏప్రిల్ 26 , 27 తేదీల్లో శాసనసభ ప్రాంగణంలో రెండవ విడత కార్యక్రమాన్ని ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు. పత్రిక విలేఖరుల సైతం ఏప్రిల్ 27వ తేదీన ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరని స్పీకర్ తెలిపారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరూ తమ ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకువచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ్మినేని సీతారాం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement