Saturday, April 27, 2024

AP విశాఖే రాజ‌ధాని అంటూ మ‌రో కొత్త నాట‌కం – జ‌గ‌న్ పై విరుచుకుప‌డ్డ ష‌ర్మిల‌..


ఇప్ప‌టికే మూడేళ్లు మోసం..
తాజాగా మ‌రో ప‌దేళ్లూ మోస‌మే.
స్టీల్ ప్లాంట్ అమ్ముతున్న మోనం మీ విజ‌న్..
కొండ‌లు , గుట్ట‌ల్ని మింగేయ‌డం మీకు ఫ్యాష‌న్..
దిగ్జ‌జ ఐటి కంపెనీలు త‌రిమేయ‌డం మీ హ్యాబీ.

విజ‌య‌వాడ – పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లూ పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని జ‌గ‌న్ ను ప్రశ్నించారు ఎపి కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల‌. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ”పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్‌మెంట్‌. ఐటీ హిల్స్‌ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా.. చూస్తూ ఉండటం మీ రోడ్‌ మ్యాప్‌. ఆంధ్రుల తలమానికం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్‌. రైల్వే జోన్‌ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్‌. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం.. ఇదే విశాఖపై వైకాపా విజన్‌” అని షర్మిల వ్యంగ్యంగా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement