Friday, May 17, 2024

లోకేశ్‌పై నమ్మకం లేక పవన్ నమ్ముకున్నారు : మంత్రి అమర్నాథ్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు ఆశయాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. సొంత పుత్రుడు లోకేశ్‌పై నమ్మకం లేక చంద్రబాబు దత్తపుత్రుడిని నమ్ముకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన అని అన్నారు. జనసేనకు సిద్ధాంతాలు లేవన్న మంత్రి అమర్నాథ్.. చంద్రబాబు కోసమే పనిచేస్తోందని దుయ్యబట్టారు. కౌలు రైతుల కష్టాలకు చంద్రబాబు కారణమని దత్త పుత్రుడు తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు. కౌలు రైతుల మరణాలకు చంద్రబాబు కారణం అని అన్నారు. రైతులను మోసగించిన చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్ ప్రభుత్వాన్ని పవన్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కౌలు రైతుల కష్టాలకు కారణం చంద్రబాబేనని దత్తపుత్రుడు తెలుసుకోవాలని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement