Sunday, April 28, 2024

AP – మీ సీటును మడత వేసేందుకు ప్రజలు సిద్ధం – జగన్ కు లోకేష్ కౌంటర్

విజయనగరం – అధికార పార్టీ నాయకులు షర్ట్ స్లీవ్స్‌ను మడత పెడితే.. ప్రజలు కుర్చీని మడత పెడతారంటూ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. వచ్చే ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులను ఓటర్లందరూ తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.దీనికి కొనసాగింపుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. ఏకంగా కుర్చీని మడత పెట్టి చూపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రజలు ఈ : సీఎం జగన్ ఒక ప్యాలెస్ పిల్లి అని.. రాజధాని పేరుతో ఆయన ఎన్ని జే టర్న్‌లు తీసుకున్నారో అందరికీ తెలుసని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. మడత పెట్టేస్తారని అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

జగన్‌కు స్కామ్‌స్టర్‌గా అభివర్ణించారు. రాజధాని ఫైల్స్ సినిమానూ అడ్డుకున్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఏ ప్రాంతానికీ న్యాయం చేయలేదంటూ మండిపడ్డారు. అయిదు సంవత్సరాల పాటు కాలయాపన చేశారని విమర్శించారు.

సీఎం జగన్ ఒక ప్యాలెస్ పిల్లి అని.. రాజధాని పేరుతో ఆయన ఎన్ని జే టర్న్‌లు తీసుకున్నారో అందరికీ తెలుసని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement