Sunday, April 28, 2024

AP రేప‌టి నుంచి జ‌గ‌న్ క‌డ‌ప‌లో ప‌ర్య‌ట‌న …

అమ‌రావ‌తి – ఈ నెల 7,8 తేదీల్లో సీఎం జ‌గ‌న్ వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కడప చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు, అనంతరం వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బసచేస్తారు.

8 వ తేదీ షెడ్యూల్‌
ఎనిమిదో తేది ఉదయం 8.20 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌ హౌస్‌నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. అక్క‌డ డాక్టర్‌ వైఎస్సార్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌, బనాన ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ ప్రారంభిస్తారు. అలాగే డాక్టర్‌ వైఎస్సార్‌ మినీ సెక్రటేరియట్‌ కాంప్లెక్‌, , డాక్టర్‌ వైఎస్సార్‌ జంక్షన్‌చ సెంట్రల్‌ బౌల్‌ వార్డ్ . వైఎస్‌ జయమ్మ షాపింగ్‌ కాంప్లెక్స్‌, వైఎస్సార్‌ ఉలిమెల్ల లేక్‌ ఫ్రంట్‌, ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్ 1 ల‌ను ప్రారంబించ‌నున్నారు జ‌గ‌న్ . అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement