Monday, May 6, 2024

మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ హోం మంత్రి

పెదపారుపూడి (ప్రభ న్యూస్) : కృష్ణా జిల్లాలో జ‌రిగిన బాలిక ఇన్సిడెంట్ విష‌యంలో ఏపీ హోంమంత్రి తానేటీ వ‌నిత స్పందించారు. పామర్రు మండల పరిధిలోని నీ భాను పూడి గ్రామంలో ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురై చనిపోయింది ఆ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్, కలెక్టర్ రాజబాబు, ఎమ్మెల్యే అనిల్ కుమార్, తో కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి మేము అండగా ఉంటామని ధైర్యం చెప్పి పది లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు.

- Advertisement -

ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని ఆమె ఆవేదన వెలిబుచ్చారు నిందితులను వదిలేది లేదని వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు ఇలాంటి సంఘటనలను ప్రతిపక్షం రాజకీయం చేయకూడదని ఇతవు పలికారు ఎమ్మెల్యే అనిల్ మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని మైనర్ బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement